చాంద్ బవోరి రాజస్ధాన్ లోని అభనేరిలో కలదు. ఇండియాలోని దిగుడు బావులలో కెల్లా అందమైన బావి ఇది. ఈ మెట్ల బావిని 9వ శతాబ్దంలో ఈ ప్రాంతపు రాజు రాజా చంద్ నిర్మించారు. ఈ మెట్లబావులు పురాతన కాలంలో వర్షాల నీటితో నిండి, నీరు అవసరమైన వేసవి కాలంలో వాడుకునేందుకు రిజర్వాయర్లుగా ఉపయోగపడేవి.
నలుచదరంగా నిర్మించిన ఈ మెట్ల బావి లోతు సుమారు 100 అడుగులుంటుంది. దీనికి ఇరుకైన 3,500 మెట్లు 13 అంతస్తులలో నిర్మించారు. ఈ బావికి మూడు వైపులనుండి మెట్లు కలవు. నాలుగవ వైపు ఒకదానిపై మరొకటిగా మంటపాలను నిర్మించారు. ఈ మంటపాలలో అందమైన శిల్పాలు, చెక్కడాలు నిర్మించారు. ఇక్కడే ఒక స్టేజి మరియు కొన్ని గదులు కూడా కలదు. దీనిలో రాజు మరియు రాణి తమ కళలను ప్రదర్శించేవారు. చాంద్ బవోరిని ప్రస్తుతం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఈ చారిత్రక కట్టడాన్ని దర్శించేందుకు ఎటుంవంటి ప్రవేశ రుసుము లేదు. ఈ ప్రదేశాన్ని కొన్ని సినిమాలలో అంటే "ది ఫాల్" మరియు "ది డార్క్ నైట్ రైసెస్" వంటి చిత్రాలలో షూటింగ్ లలో వాడారు.