రాజస్ధాన్ లోని అభనేరి గ్రామంలోని చాంద్ బవోరి ఎదురుగా హర్షత్ మాత దేవాలయం కలదు. ఈ దేవాలయాన్ని 8వ లేదా 9వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం మాత హర్షత్ మాత దేవత కొరకు నిర్మించారు. ఈమె సంతోష ఆనందాలను కలిగిస్తుందని విశ్వసిస్తారు. భక్తులు ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి ఎడతెగని సంతోషానందాలను పొందుతారు.
ప్రతి సంవత్సరం హర్షత్ మాత దేవాలయంలో మూడు రోజులపాటు జాతర నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పొరుగు గ్రామాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. చక్కని శిల్పకళకు ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయం ఇపుడు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నిర్వహణలో కలదు.