సదర్మత్ట్ ఆనకట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురాతనమైన ఆనకట్ట. ఈ ఆనకట్ట 1891-92 సంవత్సరం లో నిర్మించారు. ఈ అత్యంత పురాతనమైన ఆనకట్ట ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది. కద్దం మరియు ఖానాపూర్ మండలాలకు పంటల సేద్యం కోసం గోదావరి నది పై నిర్మించారు.
శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నుండి 50 కి.మీ. దూరంలో సదర్మత్ట్ ఆనకట్ట ఉంది. నిజానికి, ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ తో ఆనకట్ట కలపడానికి ప్రణాళికలు ఉన్నాయి. ఇలా చేయటం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో చాలా మంది రైతులకు సాగు నీటి సరఫరా ప్రధానంగా జరుగుతుంది.
ఈ అనకట్ట మరియు చుట్టు ప్రక్కల ప్రదేశాలు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్నాయి. ఆనకట్ట చుట్టూ ప్రక్కల ఆకుపచ్చ గడ్డిభూములు మరియు మెరుపులతో ప్రవహించే వాటర్ ఫాల్స్ కలవు. పర్యాటకులకు ఇక్కడ గడిపితే అసలు టైమే తెలియదు,అంత మైమరచి పోతారు.