పండాలం ప్యాలెస్ అచంకోవిల్ నది ఒడ్డున కలదు. ఇది పాండాలం రాజ కుటుంబానికి స్వస్ధలం. రాజభవనం పండాలం లో అదూర్ పట్టణానికి 10 కి.మీ.ల దూరంలో కలదు. కేరళ చరిత్రలో ఈ రాచ కుటుంబం విశిష్ట స్ధానాన్ని కలిగి ఉంది. ఈ వంశస్ధులు, మదురై కు చెందిన పాండ్య రాజుల వంశీకులని చెపుతారు.
పండాలం ప్యాలెస్, చారిత్రక ప్రాధాన్యతే కాక, మతపర విశిష్టత కూడా కలిగి ఉంది. ఇతిహాసాల మేరకు, స్వామి అయ్యప్ప పడాలం రాజ వంశంలో జన్మించాడు. అయ్యప్ప విగ్రహం కల ఒక దేవాలయం అచంకోవిల్ నది ఒడ్డున కలదు. ఈ దేవాలయం అచ్చంగా శబరిమలై దేవాలయ నమూనాలో ఉంటుంది.
ఈ ప్రాంతంలో మకరవిళక్కు పండుగను విశిష్టతతో ఆచరిస్తారు. అయ్యప్ప స్వామి ఆభరణాలు పండాలం నుండి శబరిమలైకు ఒక ఘనమైన ఊరేగింపులో పండుగకు మూడు రోజుల ముందు తరలిస్తారు. దైవత్వం దానితోపాటు జరిపే వివిధ పండుగలు పండాలం ప్యాలెస్ ను ఒక పర్యాటక ఆకర్షణగా నిలిపాయి.