కాలేజ్ టిల్లా అగర్తలాకు కీలక ప్రదేశం. కాలేజ్ టిల్లా లో బీర్ బిక్రం కళాశాల చాలా ముఖ్యమైన గమ్యస్థానం. దీన్ని 1947 లో త్రిపుర మహారాజు బీర్ బిక్రం మాణిక్య బహదూర్ పేరిట స్థాపించారు. ఇక్కడి ప్రజల విద్యా వ్యాసంగాన్ని నిలబెట్టడానికి పేరెన్నిక గన్న ఈ కళాశాల యువతను అన్ని రంగాల్లో సాదరంగా ఆహ్వానించి విద్య గరపుతోంది. 254 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వుండే ఈ కళాశాల ఒకప్పటి తూర్పు పాకిస్తాన్, ఇప్పటి బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలస విద్యార్ధులకు ప్రధాన విద్యా కేంద్రం.
ఈ కళాశాల కాకుండా త్రిపుర విశ్వవిద్యాలయ భవనాలు, అంతర్జాతీయ క్రికెట్ మైదానం, ఫుట్ బాల్ స్టేడియం లాంటివి కూడా కాలేజ్ టిల్లా లో వున్నాయి. చుట్టూ ఇన్ని భవనాలు వున్నా కాలేజ్ టిల్లా లో పచ్చదనం పుష్కలంగా వుంటుంది. దట్టమైన పచ్చటి తోటలు, పార్కులు, ప్రకృతి సిద్ధమైన సరస్సులు, నడవడానికి చాలా విస్తీర్ణం ఇవన్నీ కాలేజ్ టిల్లా లో వుంటాయి.