అగర్తలా వెళ్ళే యాత్రికులు తప్పక చూడాల్సిన ప్రదేశం పచ్చదనం పుష్కలంగా వుండే జాంపుయి కొండ. ఇది నగరం నుంచి 240 కిలోమీటర్ల దూరంలో వుండడం వల్ల ఒక రోజంతా కేటాయించాలి, కానీ యాత్ర మాత్రం సంతృప్తినిస్తుంది. “నిత్య వసంతంలా” వుండే కొండలని ఆ పేరుకు అర్థం, జాంపుయి లో నిజంగానే అన్నీ నిత్య నూతనంగా వుంటాయి. ఈ కొండ మీద ప్రకృతి విపత్తులేవీ రావు, ఇదెప్పుడూ తాజాగా, పొడిగా వుంటుంది. సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తున వుండే జాంపుయి లో నారింజ తోటలు ఎక్కువగా వుండడం వల్ల దీన్ని త్రిపుర లోని కాశ్మీర్ గా పిలుస్తారు. ప్రతి ఏటా, నవంబర్ నెలలో నారింజ, పర్యాటక ఉత్సవాలు జరుగుతాయి, దీనికి స్థానికులు, విదేశీయులు అంతే ఉత్సాహంగా హాజరౌతారు.
నారింజలే కాక ఇక్కడ పూదోటలు, తేయాకు తోటలు కూడా చూడవచ్చు. కొండ పై భాగం నుంచి చూడాల్సిన సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలను పర్యాటకులు మిస్ కాకూడదు.