కృష్ణ మందిరం లేక లక్ష్మీ నారాయణ మందిరం నగరం మధ్యలో వుంటుంది. అగర్తలా లోని ఉజ్జయంత రాజభవనం ప్రధాన ద్వార౦ వద్ద వుండే ఈ గుడిని మహారాజ బీరేంద్ర కిషోర్ మాణిక్య నిర్మించారు – ఇప్పటికీ అగర్తలా లో బాగా రద్దీగా వుండే యాత్రా స్థలం ఇదే. కృష్ణ భక్తుడైన రాజు రాజ భవనం చుట్టూ ఇతర భవనాలతో పాటు ఈ దేవాలయం నిర్మించారు. గుడి దగ్గర అందమైన తమాల వృక్షాలు చూడవచ్చు, ఎందుకంత భగవద్గీత లో ఈ చెట్లకు, శ్రీ కృష్ణుడికి దగ్గరి సంబంధం వుంది.
ఈ దేవుడి ఆశీస్సుల కోసం నగరం నలుమూలల నుంచి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రాచీన, ఆధునిక కళా శైలుల చక్కటి మిశ్రమం అయిన ఈ నిర్మాణాన్ని శ్రద్ధగా చూడాలి. ఈ దేవాలయం త్రిపుర రాజుల పాలనా వైభవాన్ని గుర్తు చేస్తుంది.