ప్రధాన నగరం నుంచి 53 కిలోమీటర్ల దూరంలో వున్న నీర్ మహల్ మహారాజా బీర్ బిక్రం కిషోర్ మాణిక్య నిర్మించిన అద్భుతమైన రాజభవనం. రుద్రసాగర్ సరస్సు మధ్యలో వున్న ఈ నీర్ మహల్ ను మహారాజు వేసవి విడిదిగా వాడేవారు. ఈ భవన నమూనా హిందూ, ముస్లిం మిశ్రమ శైలి నిర్మాణానికి ప్రతీకగా ప్రసిద్ది పొందింది.