త్రిపుర మ్యూజియాన్ని 1970 లో స్థాపించారు, ఇది నగరం నది బొడ్డున HGB రోడ్ మీద వుంది. ఈ మ్యూజియం లో ప్రదర్శించిన వస్తువుల సాక్ష్యాల ప్రకారం త్రిపుర గత వైభవాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా అరుదైన రాతి చిత్రాలు, ఇక్కడ వున్న చాలా శిలాశాసనాల, నాణేల సాక్ష్యాలను బట్టి త్రిపుర గత చరిత్ర ఎంత ఘనమైనదో తెలుస్తుంది. ఇక్కడ ప్రదర్శించి వాటిని రాష్ట్రం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తవ్వకాలలో బయటకు తీసారు.రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే ఈ మ్యూజియంలో పిలక్ కు చెందిన బౌద్ద శిల్పాలు, బెంగాల్ లోని కాంతా ఎంబ్రాయిడరి కూడా వున్నాయి.ఈ మ్యూజియం లో ప్రాచీన కాలానికి చెందిన చాలా హస్త కళాకృతులు పరిరక్షించ బడ్డాయి. ఇక్కడి వివిధ వస్తువులు త్రిపురలోని ప్రజల సాంస్కృతిక, ధార్మిక విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి. ఈ మ్యూజియం ను సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచుతారు.