అగర్తలా నగర కేంద్రం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో వున్న బౌద్ధ దేవాలయం వేణుబన్ బుద్ధ విహార్. ఇది ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ బౌద్ధ దేవాలయం – ఇక్కడ వున్న పూర్తీ లోహపు బుద్ధ విగ్రహం సుప్రసిద్ధం అయింది. ఈ గొప్ప విగ్రహం మయన్మార్ లో తయారయి తరువాత ఇక్కడికి తేబడి౦దని చెప్తారు. బుద్ధుడి జయంతి, జ్ఞానోదయం, వర్ధంతి ని సూచించే బుద్ధ జయంతిని వేణుబన్ బుద్ధ విహార్ లో ఘనంగా జరుపుకుంటారు. ఈ దేవాలయం వర్ణ రంజితమైన ఫలకాలతో అలంకరించబడి ఎప్పుడూ పండుగ వాతావరణం కలిగి వుంటుంది. నగరం నలు మూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఈ సందర్భంగా వేణుబన్ బుద్ధ విహార్ కు చేరుకుంటారు.
వేణుబన్ బుద్ధ విహార్ ను దేశంలోని అత్యంత ముఖ్యమైన బౌద్ధ దేవాలయాల్లో ఒకటిగా భావిస్తారు, బౌద్ధులు దీన్ని చాలా భక్తితో కొలుస్తారు. ధార్మిక ప్రాముఖ్యం ఉండడమే కాక, ఈ దేవాలయం ఒక ప్రసిద్ద పర్యాటక ఆకర్షణ కూడా.