64 స్తంభాలు అని అర్ధం ఉన్నచౌసట్ ఖంబ నిజాముద్దీన్ లోని ఒక సమాధి, న్యూ ఢిల్లీ లోని సూఫీ ముస్లిముల దర్గాలు, సమాధుల వారసత్వ ప్రాంతం. దీనిని మొఘలుల చక్రవర్తి జహంగీర్ కాలంలో 1623-24 మధ్య అక్బర్ చక్రవర్తి ఆయా జిలి అంగా భర్త అతగా ఖాన్ కుమారుడు, మీర్జా అజీజ్ కోక కట్టించాడు.
అక్బర్ చక్రవర్తి పాలనలో అతని తండ్రి అతగా ఖాన్ ప్రధాన మంత్రిగా ఉండగా, జహంగీర్ పాలనా కాలంలో గుజరాత్ గవర్నర్ గా ఉన్న మీర్జా అజీజ్ కోక తన కోసం ఒక సమాధి నిర్మించాలనుకొన్నాడు.
నిజానికి దీనిని ఒక సభా మందిరంలా నిర్మించి తర్వాతి కాలంలో ఒక సమాధిగా మార్చారు. దీని చతురస్రాకార కట్టడాన్ని పూర్తిగా పాలరాతితో నిర్మించారు. పేరుకు తగినట్టుగానే ఈ కట్టడంలో 64 స్తంభాలు, 25 అఖాతాలు ఉన్నాయి. చదునైన పైకప్పు ఉన్న ఈ సమాధిని వారసత్వ కట్టడంగా ప్రకటించారు. ఇది, దీని పోషక సాధువు కూడా అయిన హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా నివాసమయిన రద్దీగా ఉండే కేంద్రం నిజాముద్దీన్ బస్తీకి కుడి వైపున ఉంది.