మరియం అక్బరు మొదటి రాజపుత్ర భార్య.ఈవిడ ఇప్పటి అజ్మీరు గా పిలవబడే ఆంబర్ రాజు అయిన రాజా భర్మల్ యొక్క పెద్ద రాకుమారి.అక్బరు ఎంతో కాలం ఎదురు చూసిన మగబిడ్డ సలీం ఈమే పుత్రుడే. ఈ సలీమే తరువాత నూరుద్దీన్ సలీం జహంగీర్ గా పిలువబడ్డాడు.పుత్రోత్సాహం తో అక్బరు మరియం కి "మరుయం ఉజ్ జమాని" అనగా "నవయుగపు మేరి" అనే బిరుదు నొసగాడు.
మరియం ఉజ్ జమాని 1622 లో మరణించింది. జహంగీరు ఈ కోట ని తన మాత్రుమూర్తి స్మ్రుత్యర్ధం నిర్మించాడు. ఈ కోట ప్రస్తుతం జ్యూతీ నగర్ తంత్ పూర్ రోడ్ లో అక్బర్ సమాధి కి దగ్గరలో ఉంది. పరదా లో ఉన్న రాజ కుటుంబ స్త్రీల కోసమని మొదట ఈ కోట నిర్మించారు.ఈ కోట లో ఉన్న ప్రాంగణం చుట్టూ అనేక గదులున్నాయి.ఉత్తర భాగం లో ఉన్న ఉద్యాన వనం చిన్న వంతెన ద్వారా ప్యాలెస్ కి కలపబడుతుంది.