మెహతాబ్ బాఘ్ లేదా వెన్నెల ఉద్యానవనాన్ని 1631-1635 సంవత్సరాల మధ్య నిర్మించారు. అద్భుతమైన ఈ తోట యమునా నది ఒడ్డున 25 ఎకరాలలో వ్యాపించి ఉంది. తాజ్ మహల్ తో ఖచ్చితంగా సమానంగా దీని వెడల్పు ఉన్నందున ఇది తాజమహల్ తో సౌష్టవమైన అమరికను కల్గి ఉంది.
తోట మధ్యలో అష్టభుజి ఆకృతిలో ఉన్న ఒక కొలను ఉంది. దీనిలో తాజ్ మహల్ ప్రతిబింబం కనబడటం వలన ఈ తోటలో ఉన్నప్పుడు సందర్శకులు ఈ గొప్ప సమాధిని చూసి ఆనందించవచ్చు. ఈ కొలనులోనికి నీరు ఒక దిగుడు జలపాతం నుండి వస్తుంది.
దురదృష్టవశాత్తూ మొఘల్ కాలంలో దీనిని ప్రారంభించిన నాటినుండి ఈ తోట యమునా నది వరదల వలన దుర్బలంగా మిగిలింది. నీటి వలన దీని నిర్మాణం కొట్టుకు పోయింది. అందువలన ఇది శిధిలావస్థలో ఉంది.
దీని మూలలలో ఉన్న నాలుగు ఇసుకరాతి స్తంభాలలో కేవలం ఒకటి మాత్రమే వరదల ప్రభావ౦ తట్టుకొని నిలబడింది. కొలనుకు ఉత్తర, దక్షిణాలుగా ఉన్న బహుశా ఈ తోట రెండు మంటపాల నిర్మాణాల పునాదులు ఇంకా కనబడుతూనే ఉంటాయి.