భారతదేశ గొప్ప కట్టడాల నిర్మాత, నిర్మాణ కళలలో చక్కటి ప్రావీణ్యం కల్గిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ మోతీ మసీదును నిర్మించాడు. ముత్యపు మసీదుగా కూడా పిలిచే ఈ మందిరం ఒక పెద్ద ముత్యంలా మెరుస్తూ దాని పేరుకు తగిన న్యాయం చేస్తుంది.
తన రాజసభలోని సభ్యుల కోసం దీనిని ఆగ్రా కోట ప్రాంగణంలో నిర్మించాడు. మాస్కో లోని సెయింట్ బాసిల్ క్యాథడ్రాల్ ను సందర్శించిన వారెవరైనా దీనిలోని వాస్తు శైలిలోని చాల లక్షణాలు క్యాథడ్రాల్ లోని వాటితో దగ్గర పోలికను కల్గి ఉండటం తప్పకుండా గమనిస్తారు.
మసీదులోని ప్రాంగణం ఆవరణ వరుస దారులు, వంపులు తిరిగిన మాంద్యాలతో నిండి ఉంది. ఈ మందిరం పై కప్పుకి ఎర్ర ఇసుకరాయి గోడలపై నిర్మించిన మూడు తెలుపు పాలరాయి గుమ్మటాలు మెరుస్తూ కనిపిస్తుంటాయి.
దివ్యమైన సౌష్టవంతో నిర్మించిన మోతీ మసీదు అద్భుతమైన రూపంతో కనిపిస్తుంటుంది. ఇది యమునా నది ఒడ్డున, ఆగ్రా నగరానికి కేంద్రానికి దగ్గరగా కూడా ఉంది.