రాం బాఘ్ లేదా బాఘ్-ఏ-గుల్ అఫ్షాన్ గా కూడా పేరొందిన రాం బాఘ్ భారతదేశపు మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ 1528 వ సంవత్సరంలో సంకల్పించి, కట్టించాడు. ఇది చిని కా రౌజా నుండి కేవలం 500 మీటర్ల దూరంలో, ఇతిమాద్ ఉద్ దౌలా సమాధి నుండి 3 కిలోమీటర్ల దూరంలో, ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్ మహల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ విశాలమైన అద్భుత ఉద్యానవనం మెరుగైన మార్గాలు, కాలువలతో నాలుగు విభాగాలుగా విభజించబడింది. ఇది నాలుగు తోటల ఇస్లామిక్ భావనను లేదా భూమిపై ఉన్న స్వర్గ ఉద్యానవనాన్ని సూచిస్తుంది.
ఈ కాలువలలోని నీరు యమునా నది నుండి రావడమే కాక మూడు ఎత్తైన ప్రదేశాలపై నిర్మించిన మూడు సెలయేళ్ల ద్వారా సరఫరా చేయబడుతుంది. యమునా నది ఎదురుగా ఉన్న రెండు మంటపాలలో భూగర్భ నేలమాళిగలు లేదా తెహఖానాలు వెచ్చటి వేసవి నెలలలో రాజకుటుంబీకులకు ఆశ్రయం ఇచ్చేవి.
ఈ ఉద్యానవనంలో అద్భుతమైన భూభాగాలతో పెద్ద సంఖ్యలో వంపులు తిరిగిన జలమార్గాలు, ఫౌంటైన్లు ఉన్నాయి. కాలగమనంతో పాటుగా ఇది పాత పడినందువలన, మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య బేగం నూర్జహాన్ దీనిని పునరుద్ధరించింది.