ఉత్తర భార దేశం లో గల క్యాథలిక్ స్మశాన వాటికలలో పురాతనమైన రోమన్ క్యాథలిక్ సిమెటరీ మహాత్మ గాంధీ రోడ్ లో ఆగ్రా సివిల్ కోర్టు కి దగ్గరలో ఉంది.చుట్టూ ప్రహరీ గల ఈ స్మషానం లో చారిత్రక వ్యక్తుల సమాధులున్నాయి.వీరిలో యూరప్ నుండి ఇండియా వచ్చిన సాహసికులు,సైనుకులు, కళాకారులున్నారు.కల్నల్ జాన్ విలియం హెస్సింగ్ సమాధి ప్రధాన ద్వారం దగ్గరలో ఉంది.
ఈయన 1700 లో భారత ఉపఖండానికి వచ్చి ఇక్కడే మరణించారు. ఆయన స్మ్రుత్యర్ధం ఆయన కుటుంబీకులు తాజ్మహల్ తరహా నిర్మాణం చెయ్యాలని తలచారు. కానీ వారికున్న పరిమిత వనరుల వల్ల మినీ తాజ్ మహల్ గా పిలవబడే సమాధి ని నిర్మించారు.ఈ సమాధి ఎర్రని ఇసుక రాయితో నిర్మించబడింది.ఖరీదైన అలంకరణలు లేకపోయినా ప్రవేశ ద్వారం పూల డిజన్లతో అలంకరించబడి ఉంటుంది.