తాజ్ మ్యూజియం ప్రత్యేకించి తాజ్ మహల్ పండితులు, పరిశోధకులు ఎక్కువగా సందర్శించే ఆగ్రాలోని పర్యాటక ప్రాంతాలలో ఒకటి. తాజ్ మహాల్ సముదాయంలో ప్రధాన ద్వారానికి ఎడమ వైపున ఉన్న జల్ మహల్ లో 1982 లో నిర్మించిన ఈ మ్యూజియం ఉంది. దీనిలో ప్రధాన మందిర౦తో బాటుగా రెండు అంతస్థులు, మూడు ప్రదర్శన శాలలు ఉన్నాయి.
ఈ మ్యూజియంలో రాత ప్రతులు, సూక్ష్మ చిత్రాలు, రాజాదేశాలు, ఆయుధాలు, వంటపాత్రలు, అలంకరణ సామాగ్రి, అప్పట్లో ఆగ్రాలో ముద్రించిన నాణేల అనుకరణలు వంటివి ఇక్కడ గల 120 ప్రదర్శకాలలో ఉన్నాయి.
దీనిలో సందర్శకులకు ఏ కోణం నుండి చూసిన వాటి అడుగుభాగం కనబడే విధంగా వాటి స్థానాన్ని రూపకల్పన చేసిన సమాధులను సూచించే అసలైన రేఖా చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రపంచపు ఏడు అద్భుతాలలో ఒకటి తాజ్ మహల్ దోషరహిత నిర్మాణ౦, సంకల్పనకు సంబంధించిన రాతప్రతులు, ఇతర ముఖ్యమైన పత్రాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.
ఒక అలంకరించిన చెక్క చట్రంలో అమర్చబడిన షాజహాన్, అతని ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ చిత్తరువులు అతి ముఖ్యమైన ప్రదర్శితాలలో ఉన్నాయి. నామమాత్రపు ప్రవేశ రుసుముతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ మ్యూజియం ప్రజల సందర్శనార్ధం తెరిచి ఉంటుంది.