విజయనగర అడవులలో నెలకొని ఉన్నఈ పోలో మాన్యుమెంట్ ఇదర్ యొక్క పరిహార్ రాజుల చేత స్థాపించబడిన ప్రాచీన సామ్రాజ్యం యొక్క శిధిలం. ఈ ప్రాంతం లో మొదటి మానవ నివాసం పురాణం కాలం నుండి ఇప్పటికి ఉనికి లో ఉన్న హర్నవ్ అనే జీవ నది తో పాటు ఉద్భవించిందని నమ్ముతారు. పరిహార్ రాజులచే ఈ సామ్రాజ్యం స్థాపించబడిన తరువాత ఈ ప్రాంతం 15 వ శతాబ్దం లో మార్వార్ యొక్క రాథోడ్ రాజవంశీకుల ఆధిక్యం లో కి వచ్చింది. మార్వారీ పదం 'పోలో' అనగా 'ద్వారం' అని అర్ధం.
గుజరాత్ అలాగే రాజస్తాన్ల కి ప్రవేశ మార్గం గా ఈ ప్రాంతం వ్యవహిరించడాన్ని ఈ పేరు సూచిస్తుంది. తూర్పున ఉన్న కలలియో పర్వతం అలాగే పడమర లో ఉన్న మమ్రేచి ల కి మధ్యలో ఈ ప్రాంతం ఉంది. ఈ రెండు ప్రాంతాలు ఈ ప్రాంతం లో కి సూర్యరశ్మి ని రాకుండా బంధిస్తాయి. అందువల్లే ఈ ప్రాంతం ఖాళీ చెయ్యబడడానికి కారణం.
శివ మందిర్, సూర్య మందిర్, లఖేన టెంపుల్, జైన్ దేరసర్ వంటివి ఈ ప్రాంతం లో కనిపించే పోలో నగరం యొక్క కొన్ని శిధిలాలు. ఆకు రాల్చు అడవి అయిన విజయనగర అడవి దాదాపు 400 చదరపు అడుగుల మేరకు విస్తరించింది. ఔషద మొక్కలు, సరీసృపాలు, పక్షులు, జంతువులూ అలాగే ఆది వాసీలతో ఈ అడవి నిండి ఉంటుంది.