ఐహోళే దర్శించే పర్యాటకులు యెనియార్ దేవాలయాలకు దక్షిణంగా కల రామలింగ గ్రూప్ దేవాలయాలు తప్పక చూడాలి. రామలింగ దేవాలయం త్రికుటాచల నమూనాలో ఉంటుంది. ఇక్కడి సముదాయంలో ఇది ప్రధానమైనది. ఈ దేవాలయం రెండు గదులలో శివలింగాలుంటాయి. పార్వతి విగ్రహం మూడవ దానిలో ఉంటుంది.
ఈ దేవాలయం క్రీ.శ. 11వ శతాబ్దంలో నిర్మించిందిగా చెపుతారు. రామలింగ గ్రూపు దేవాలయాలు మలప్రభ నది ఒడ్డున కలవు. ఇక్కడే ఒక చిన్న మసీదు కూడా కలదు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చిలలో రధోత్సవం జరుగుతుంది.