ఐహోళే ప్రధాన ఆకర్షణలలో త్రయంబకేశ్వర దేవాలయ సముదాయం ఒకటి. ఈ సముదాయంలో అనేక గుడులు కలవు. వీటిలో ప్రధానమైనవి రెండు త్రికూటాచలాలు మరియు మద్దినగుడి. త్రికుటాచల దేవాలయాలు అంటే మూడు గదులు కల గుడులు. వీటిని 12వ శతాబ్దంలో నిర్మించారు.
అయితే మద్దినాగుడి దేవాలయం మాత్రం 11వ శతాబ్దం నాటిది. పర్యాటకులు అందమైన నటరాజ విగ్రహాన్ని చూడాలంటే తప్పక త్రయంబకేశ్వర దేవాలయాలనను చూడాల్సిందే. ఈ సముదాయంలోని ప్రధాన దేవుడు పార్శ్వనాధుడు.