అబ్దుల్లా ఖాన్ సమాధి తెల్లని పాలరాయితో చేసిన ఒక అందమైన జ్ఞాపకం, దీనిని సయ్యద్ సోదరులు క్రీ.శ. 1710 లో వారి తండ్రికోసం నిర్మించారు. నాలుగు మెట్లు కల ఒక ఎత్తైన వేదికమీద ఉన్న ఈ దీర్ఘచాతురస్త్రాకారపు సమాధి అలంకరించబడిన తోరణాలతో, నాలుగు స్తంభాలతో రూపకల్పన చేయబడింది.
ఈ సమాధి తర్వాతి మొఘల్ శకం నమూనాల అద్భుతమైన సంగ్రహం. దీనికి దగ్గరలో ప్రస్తుతం ఒక మసీదు ఉన్నట్లు ఒక ఫలకంపై పేర్కొనబడింది. అయితే, దీనికి సమీపంలో అబ్దుల్లా ఖాన్ భార్య సమాధి మాత్రమే వుంది.