అనా సాగర్, 13 కిలోమీటర్ల విశాలమైన ప్రాంతంలో పృథ్వీ రాజ్ చౌహాన్ తాతగారు అనాజీ చౌహాన్ నిర్మించిన కృత్రిమ సరస్సు. ఈ సరస్సు పరీవాహక ప్రాంతాన్ని స్థానికుల సహకారంతో క్రీ.శ.1135 నుంచి 1150 మధ్య నిర్మించారు.
ఈ సరస్సు పరిసర ప్రాంతాల్లో జహంగీర్ చక్రవర్తి దౌలత్ బాగ్ తోటను కట్టించాడు. ఈ చెరువులో ఒక ద్వీపం వుంది – దీని చుట్టూ పాలరాతి ఆవరణలు, అందమైన పార్కులు వున్నాయి. దౌలత్ బాగ్ తూర్పు వైపు నుంచి ఈ ద్వీపాన్ని చేరుకోవడానికి నీటి స్కూటర్లు, బోట్లు అందుబాటులో వున్నాయి.
ఈ సరస్సు అందం పెంచడానికి ముఘల్ చక్రవర్తుల కొన్ని అదనపు నిర్మాణాలు కూడా చేసారు. బ్రిటిష్ వారి నివాస భవనం గా వాడిన సర్క్యూట్ హౌస్ ఈ చెరువు దగ్గరలోని ఎత్తైన కొండ మీద వుంది.