అజ్మీర్ లోని పురావస్తు ప్రదర్శనశాల1949 లో ఏర్పాటైన పురావస్తు ప్రదర్శనశాల రాజస్థాన్ లోని అజ్మీర్ లో దిలే ఆరామ్ తోటల్లో వుంది. ఈ మ్యూజియం ను మూడు విభాగాలుగా విభజించారు - దీంట్లో అనేక శాసనాలు వున్నాయి, పురాతన నాగరికతలకు చెందిన తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి.
బర్నాలా శాసనాలు, 8వ శతాబ్దానికి చెందిన ప్రతీహార శాసనాలతో, చరిత్ర పూర్వ కాలానికి చెందిన టేర్రాకోటా తోనూ అలంకరించిన రెండు ‘యూప స్తంభాలు’ (అంటే బలి పీఠాలు) ఇక్కడ వున్నాయి. రాయిర్, బైరాట్, సంభార్, నాగర్ లాంటి ప్రదేశాల్లో తవ్వకాల్లో బయటబడిన చాలా వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 4.45 వరకు తెరిచి వుండే ఈ ప్రదర్శనశాలకు ప్రవేశ రుసుము భారతీయులకు 3 రూపాయలు, విదేశీయులకు 10 రూపాయలు.