అజ్మీర్ లోని మందిర్ శ్రీ నిమ్బార్క్ పీఠాన్ని – తాంత్రికుడైన ఫికిర్ మస్తింగ్ షా దురాగతాల నుంచి ప్రజలను విముక్తుల్ని చేసేందుకు ఖేజర్లి కి చెందిన భాటి ముఖ్యుడు శ్రీ శివజీ, గోపాల్ సింగ్ జీ భాటీ స్థాపించారు. అంతేకాక ఈ మందిరం వైష్ణవ భక్తీని చాటడానికి కూడా ఉపయోగపడింది.
భక్తులు గుడి లో అడుగు పెట్టిన క్షణం నుంచీ దేవుడు కనబడేలా ఈ గుడి నిర్మాణాన్ని రూపొందించారు. ఏడు మెట్లు ఎక్కి గుడి ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవచ్చు.ఈ ఆలయం 42 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడి, అలంకరించబడిన స్తంభాలను కలిగిఉంది.
పసుపు మట్టి, సున్నపు రాయి, పాలరాయి ఈ మందిర నిర్మాణానికి ఉపయోగించిన ముడిసరుకు. రాధాకృష్ణుల ప్రేమ యొక్క పవిత్ర భావాలను ప్రోది చేయడానికి, వైష్ణవులలో శాశ్వతమైన వేద సనాతన ధర్మ ప్రచార లక్ష్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.