లేహ్ జిల్లాలో గల "ఆల్చి" గ్రామం సుప్రసిద్ధమైనది. ఇండస్ నది ఒడ్డున "లేహ్" జిల్లాకి 60 కి.మీ. దూరంలో గల ఈ గ్రామం హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో ఉంది.
ఈ గ్రామం లో "ఆల్చి" అనే పేరుతోనే ఒక పురాతన మఠం ఉంది.ఈ మఠం లడఖ్ లో గల అనేక యాత్రా స్థలాలలో ఒకటి. లడఖ్ లో గల ఇతర మఠాలు పర్వశ్రేణుల మీద ఉంటే, ఈ "ఆల్చీ" మఠం మాత్రం పర్వత పాద ప్రాంతం లో ఉంది.ఈ మఠ చరిత్ర 11వ శతాబ్ద కాలానికి సంబంధించినది. అసమాన శిల్పకళా నైపుణ్యానికి ఈ మఠం ప్రసిద్ధి. మఠ భవన సముదాయం లో "దు-ఖాంగ్","సం-త్సెక్","మంజుశ్రీ" ఆలయాలున్నాయి.బుద్ధుడు మరియు ఇతర దేవతల కి సంబంధించిన అనేక చిత్రాలు గోడల మీద చిత్రీకరించబడి కలవు.
ప్రక్రుతి మధ్యలో సేద తీరినట్లుండే "ఆల్చి" ప్రక్రుతి గీసిన చిత్రం లా ఉంటుంది. మఠ ఆచార వ్యవహారలని ఇక్కడికొచ్చే యాత్రికులు శ్రద్ధగా గమనించవచ్చు. ఈ గ్రామంలో రాత్రి పూట బస చెయ్యటానికి వీలుగా కొన్ని వసతులు ఉన్నాయి.భారత దేశ ప్రసిద్ధ నగరాలతో ఈ గ్రామం విమానయానం ద్వారా అనుసంధానించబడింది."లేహ్" విమానాశ్రయం "ఆల్చి" కి అతి దగ్గరలో ఉంది."లేహ్" నగరం "పూనా","ఢిల్లీ","జమ్ము","శ్రీ నగర్" తదితర నగరాలతో అనుసంధానించబడటం వల్ల ఆయా నగరాల నుండి "ఆల్చీ" చేరుకోవటం తేలిక."ఆల్చి" కి దగ్గరలో గల రైల్వే స్టేషన్ లు పఠాన్ కోట్ మరియు చండీఘర్.
"ఆల్చి" గ్రామం లో వాతావరణ పరిస్థితులు పర్యటనకు అంత అనుకూలం గా ఉండవు. ఇక్కడ చలికాలం లో గడ్డ కట్టే చలి ఉంటుంది. కానీ వేసవి ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ సంవత్సరం పొడుగునా వర్షపాతం నమోదవుతుంది. వేసవిలో రాత్రి ఉష్ణొగ్రతలు బాగా పడిపోతాయి. ఆల్చి దర్శించటానికి అనువైన కాలం..జూన్-సెప్టెంబర్ ల మధ్య కాలం.