"ఆల్చీ" గ్రామం లో గల ఆల్చీ మఠం లడఖ్ లో గల పురాతన మఠాలలో ఒకటి. ఇండస్ నది ఒడ్డున ఉన్న ఈ మఠాన్ని "ఆల్చీ చొస్ఖోర్" అనీ "ఆచీ గొంపా" అని కూడా పిలుస్తారు. దీనిని క్రి.శ. 958-1055 మధ్య కాలంలో సంస్క్రుత ,బౌద్ధ గ్రంధాలని టిబెట్ భాషలోకి అనువదించిన "రిచర్డ్ జంగ్పో" నిర్మించాడు. చదును నేల మీద నిర్మించబడటం ఈ మఠ ప్రత్యేకత.ఈ మఠ సముదాయం లో "దు-ఖాంగ్","సం-తెక్","మంజుశ్రీ" ఆలయాలున్నాయి. ఈ మఠ చరిత్ర 12-13 శతాబ్దాలకి చెందినది.ఈ భవన సముదాయం లోనే గల "లోత్సభా లకాంగ్" లేదా "తర్జుమాదారు(దుబాసి) ఆలయం" మరియు "లఖాంగ్ శోమ" ఆలయాలు ముఖ్యమైనవి.భవన ప్రవేశ ద్వారం వద్ద గల బౌద్ధ స్థూపాలుకూడా ఇక్కడి ముఖ్య కట్టడాలలో ఒకటి. "లికిర్" మఠానికి చెందిన సన్యాసులు ఈ గోంపా బాగోగులు చూస్తున్నారు.
ఇక్కడ ఫోటోలు తీయుట నిషిద్ధం. ఈ మఠానికి కరెంటు సరఫరా లేనందువల్ల యాత్రికులు ఫ్లాష్ లైట్లు లేదా టార్చి లైట్లు తీసుకుని వెళ్ళాలి.