కంధేరి కోటను సుమారుగా 320 సంవత్సరాల క్రిందట అంటే 1678లో నిర్మించారు. కొంతకాలం అది బ్రిటీష్ పాలనలో కూడా ఉంది. పీష్వా వంశస్ధులు కోటను బ్రిటీష్ పాలకులకు అప్పగించారు. ధాయ్ బీచ్ నుండి ఈ కోట 3 కి.మీ.లు మాత్రమే ఉంటుంది. సమీపంలో ఒక లైట్ హౌస్ కూడా కలదు.
ప్రస్తుతం ఇది బాంబే పోర్ట్ ట్రస్ట్ అడ్మినిస్ట్రేషన్ చే నిర్వహించబడుతోంది. వీరినుండి అనుమతి పొందితే కోట సందర్శన లభిస్తుంది.