అలీ ఘర్ కోటను ఇండియా లోనే అతి బలమైన కోట గా చెపుతారు. ఈ కోటను ఇబ్రహీం లోడి కింద పని చేసిన అప్పటి అలీ ఘర్ గవర్నర్ కుమారుడు 16 వ శతాబ్దం లో నిర్మించాడు. ఈ కోట గ్రాండ్ ట్రంక్ రోడ్ లో నలుచదరంగా వుంది చుట్టూ అగడ్త లు కలిగి వుంటుంది.
కాలానుగునంగా ఈ కోటకు మరమ్మత్తులు చేస్తూ బలపరుస్తున్నారు. 18వ శతాబ్దంలో ఈ కోట మాధవరావు సిందియా 1 పాలన క్రింద సైనికులకు శిక్షణా కేంద్రం గా వుండేది. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర పోరాటంలో కూడా ఈ కోట ప్రధాన పాత్ర వహించింది. ఈ కోట భారతీయ మరియు ఫ్రెంచ్ శిల్ప నిర్మాణ తీరు కలిగి వుంటుంది. ప్రస్తుతం ఈ కోట అలీ ఘర్ ముస్లిం యూనివర్సిటీ యాజమాన్య నిర్వహణలో వుంది. అంటే బోటనీ శాఖా ఆధ్వర్యంలో కలదు. దీని ఆవరణ లో వీరు కొన్ని మొక్కలు కూడా పెంచుతున్నారు.