ఆల్ సెయింట్స్ కేథడ్రల్, అలహాబాద్ లోని రెండు ప్రధాన రోడ్ల మధ్య ఉన్న ప్రసిద్ధ చర్చ్, ఇది 19 వ శతాబ్దంలో సున్నితమైన గోతిక్ శైలిలో బ్రిటీషు వారిచే రూపొందించబడిన భవనం. కొలకత్తా లో ప్రసిద్ధ విక్టోరియ మెమోరియల్ ని కూడా రూపొందించిన విలియం ఎమర్సన్ ప్రసిద్ధ బ్రిటీషు కళాకారుడు.
ఈ విస్తృత నిర్మాణం ఒకేసారి 400 మందికి వసతి కల్పిస్తుంది. విస్తృత మెట్లదారి, గోతిక్ శైలి మధ్యయుగ చివరి కాలంలో భాగా అభివృద్ది చెందిన విక్టోరియన్ చేక్కుళ్ళు ఆ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. ఈ చర్చ్ ప్రతి సంవత్సరం ఆల్ సెయింట్స్ డే (నవంబర్ 1) న వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈ సమయంలో ప్రత్యెక ప్రార్ధనలు, సంబరాలు ఏర్పాటుచేస్తారు. ఈ కేథడ్రల్ ను ‘పత్తర్ గిర్జ’ లేదా రాతి చర్చ్ అని కూడా పిలుస్తారు.