“సంగమం” అనే సంస్కృత పదం నుండి వచ్చిన ఈ సంగం, అక్షరాలా భారతదేశంలో మూడు పవిత్ర నదుల సంగమంగా ఉంది. ఇది అలహాబాద్ లోని గంగ, యమున, పౌరాణిక సరస్వతి నది కలిసే చోటును “త్రివేణీ సంగమం” గా పేరొందింది. సరస్వతి నది భూగర్భంలో కలిసిపోయి అద్రుశ్యమైనట్టుగా నమ్ముతారు. ఈ మనోహరమైన ప్రదేశం హిందువులకు, పూజారులకు ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంగమంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలు పటాపంచలౌతాయని హిందువుల నమ్మకం.
ఈ ప్రదేశం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా కు ప్రసిద్ది చెందింది. ప్రతి ఆరునెలలకు ఒకసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది. జనవరి మాసంలో ఇక్కడ వార్షిక మాఘ మేలా కూడా జరుగుతుంది. భక్తులు, చలిని లెక్కచేయకుండా, ఈ సంగమంలో పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ నీటిలో 1948 లోని మహాత్మా గాంధీ బూడిదతో పాటు, అనేక జాతీయ నాయకుల, వ్యక్తుల బూడిద కలిసి ఉంటుంది.