అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి సమీపం లో సియాంగ్ పాద ప్రాంతాల వద్ద నెలకొని ఉన్న పురాతన ప్రాంతం మలినిథాన్. ఈ ప్రాంతం లో జరిగిన తవ్వకాలలో 14 మరియు 15 వ శతాబ్దానికి సంబంధించిన దుర్గా ఆలయాన్ని వెలికి తీసారు. వివిధ దేవుళ్ళకి చెందిన గ్రానైట్ విగ్రహాలు, పుష్ప మరియు జంతువుల మూలాంశాలని కనుగొన్నారు. ఈ ప్రాంతాన్ని పవిత్రమైనదిగా భావించి ఏంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు.
హిందూ పురాణాలకి సంబంధించిన ప్రఖ్యాత గాధ తో ఈ ప్రాంతం ముడి పడి ఉంది. పెళ్ళికి ముందు రుక్మిణి ని భగవాన్ శ్రీకృష్ణుడు అపహరించుకుపోయాడని అలాగే వారిని పార్వతి దేవి ఆహ్వానించిందని అంటారు. సుచరు మాలిని గా శ్రీ కృష్ణుని చే పార్వతి దేవి పేరు పొందినని అందువల్ల ఆ పేరుతోనే మలినిథన్ గా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని అంటారు. అలాంగ్ నుండి ఈ ప్రాంతం 150 కిలోమీటర్ల దూరం లో ఉంది.