అలూవాలో గల ఈ శివాలయం పెరియార్ నది మరియు దాని ఉపనది అయిన మంగళప్పుజ్జ ల మధ్య ఒక ఇసుక ఒడ్డులో కలదు. ఈ శివాలయం మార్తాండ వర్మ బ్రిడ్జి నుండి ఒక కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని చెపుతారు. ఈ శివలింగానికి శ్రీరాముడు సైతం పూజలు నిర్వహించాడని చెపుతారు.
ఈ నది ఒడ్డుకు ఆవలివైపు, క్రిష్ణ బలరాముల దేవాలయం, అయ్యప్ప దేవాలయం మరియు అద్వైత ఆశ్రమం కలవు. అద్భుత శిల్ప తీరు కల అలూవా ప్యాలెస్ ఇసుక ఒడ్డుకు ఆవలివైపు కలదు. ఈ దేవాలయం మహాశివరాత్రి వేడుకలకు, దాని సుందర ప్రదేశాలకు పేరుగాంచింది.