వినయ్ విలాస్ మహల్ గా కూడా పిలిచే అల్వార్ లోని సిటీ పేలస్ మహారాజుల అతిశోభాయమానమైన జీవనశైలిని తెలిపే ఒక గొప్ప భవనం. ఈ దివ్య కట్టడాన్ని బఖ్తావర్ మహారాజు 1793 లో నిర్మించాడు. ఈ ప్రాంతం చురుకైన చరిత్రను కల్గి ఉంది. బాబర్, జహంగీర్ వంటి మొఘల్ చక్రవర్తులు, రాజపుత్ర రాజు ప్రతాప్ సింగ్ వంటి అనేక విశిష్ట రాజులు ఈ కోటలో సమయాన్ని గడిపారు.
ఈ దివ్య కట్టడం దానిలోని ప్రాంగణం మధ్యలో పాలరాయితో నిర్మించిన పద్మాకారపు బురుజు కు ప్రసిద్ది. ఈ భారీ భవనం అద్దాల పనితనానికి, కుడ్యచిత్రాలకే కాక విస్తృత శ్రేణిలో సున్నితమైన చిత్రాలను కల్గి వుండి చూసే వారికి కనువిందు చేస్తుంది. ఈ భవనపు కోశాగారంలో బంగారంతో అలంకరించిన ముఖమల్ సింహాసనం, ఒకే పచ్చ లో చెక్కిన అమూల్యమైన తాగే కప్పు ఉన్నాయి.
గుర్రపు శాల లో పెద్ద జంతువు తో బాటు రెండు అంతస్తుల ఉన్న నాలుగు ఏనుగుల బండి ఉంది. ఈ భవనంలో ప్రస్తుతం రాచరిక జ్ఞాపకాలు, చారిత్రిక ప్రదర్శితాలు, బహుమతి వస్తువులు, ఇంకా ఇతర అరుదైన చేతి వ్రాతలను సంరక్షించే మ్యూజియం ఉంది.