మూసి మహారాణి కి చాత్రి చారిత్రిక ప్రాముఖ్యత ఉన్న ఒక అద్భుతమైన స్మారక కట్టడం. ఈ రెండంతస్తుల కట్టడాన్ని బఖ్తవర్ సింగ్ అతని రాణి మూసి ల గౌరవానికి గుర్తుగా వినయ్ సింగ్ క్రీ .శ. 1815లో నిర్మించాడు. నిర్మాణ వైభవం వలన ఈ కట్టడదృశ్యం అద్భుత౦గా కనిపిస్తుంది.
ఈ నిర్మాణంలో ఇసుక రాయి స్తంభాలపై ఉన్న ఏనుగునిర్మాణ నమూనా దృష్టిని ఆకర్షించే అంశం. పై అంతస్తు పాలరాయి తో నిర్మించిన అసాధారణ గుండ్రటి పైకప్పులు, అద్భుతమైనవంపులు, అర్చిలు ఉన్నాయి. ఈ కట్టడపు లోపలి భాగాలలో అద్భుతమైన చెక్కడాలు, స్థంబింపచేసే కుడ్యచిత్రాలు ఉన్నాయి.
ఈ సముదాయంలో వందలకొద్దీ రంగురంగుల పక్షులు, నెమళ్ళు అక్కడక్కడే తిరుగుతూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఆరావళి ప్రాంతసుందరమైన దృశ్యాలు, పచ్చదనపు గుబుర్లు, రంగురంగుల పూలు ఈ భవనం అందాన్ని ఇనుమడింప చేస్తున్నాయి.