అమరావతి స్తూపం లేదా మహా చైత్య, అమరావతిలో ఒక గొప్ప ఆకర్షణ. ఈ స్తూపాన్నిబౌద్ధ మతాన్ని అనుసరించిన చక్రవర్తి అశోకుడి కాలం లో నిర్మించారు. తర్వాత చివరికి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ మత వ్యాప్తికి పాటు పట్టాడు. క్రి. పూ. 200 సంవత్సరాల నాటికే స్తూపం నిర్మాణం పూర్తి అయింది. ఈ స్తూపం , దానిపై చెక్కడాలు బుద్ధుడి జీవిత కధను మరియు అతని బోధనలను తెలియ చేస్తుంది. అమరావతి శాతవాహన రాజుల రాజధాని అయినపుడు, ఈ స్తూపాన్ని మరింత బుద్ధుడి జీవిత విశేషాలతో ని ఇతర చిత్రాలతో అలంకరించారు.
అయితే, తదుపరి కాలం లో బౌద్ధ మతం ప్రభావం కోల్పోయినందున ఆ స్తూపం మట్టిలో కప్పబడి వుంది, సుమారు క్రి. పూ. 1796 సంవత్సరంలో ఆ ప్రదేశాన్ని సందర్శించిన కల్నల్ కోలిన్ మెకంజీ చే కనుగొనబడింది. ఒకసారి తవ్వకాలు మొదలైన తర్వాత స్తూపమే కాక దానికి సంబంధించిన అనేక శిల్పాలు కూడా బయట పడ్డాయి. నేడు ఆ స్తూపమే దక్షిణ ఇండియా లో కనుగొనబడిన అశోక పిల్లర్ గా వ్యహరించబడుతోంది.