హిందూ వినాశన దైవం (లయకారుడు) అయిన మహా శివుని భక్తులు అమర్ నాథ్ యాత్ర కు పూనుకుంటారు. ఈ యాత్రను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 5వ హిందూ మాసం అయిన శ్రావణం లోనిర్వహిస్తుంది. అమర్ నాథ్ యాత్రికులు సాధారణంగా కఠినమైన వాతావరణ పరిస్థితులు, ఏటవాలు అధిరోహక బాటలు లాంటి అనేకానేక బాధలను ఎదుర్కొంటారు.
ఈ కష్టతరమైన యాత్ర,పహల్గాం పట్టణం నుంచి మొదలవుతుంది. అమర్ నాథ్ గుహ కి వెళ్ళే దారిలో ఎదురయ్యే పరిసరాల అందం, యాత్రికులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. జూన్, జూలై, ఆగష్టు నేలలను తప్పించి మిగతా కాలమంతా చుట్టు పక్క ప్రాంతాన్ని అంతటినీ మంచు కప్పివేస్తుంది. అందువల్ల, ఆలయం కేవలం ఈ నెలలలో మాత్రమే తెరవబడి ఉంటుంది.