బలరాం అంబాజీ వన్యప్రాణి అభయారణ్యం, గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో ఉంది. ఈ ప్రాంతంలో రెండు ఎదురెదురు మూలల్లో ఉన్న బలరాం, అంబాజీల ఆలయాల వలన ఈ అభయారణ్యానికా పేరు వచ్చింది. ఈ అభయారణ్యాన్ని 1989 లో ఆగష్టు 7 వ తేదిన వన్య ప్రాణులను, దాని వాతావరణాన్ని రక్షించి, ప్రచారం తో పాటు, అభివృద్ధి చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం స్థాపించింది.
ఈ అభయారణ్యంలో ఎలుగుబంటి, పందికొక్కు, చారల హైనా, నీలి ఎద్దు, నక్క, భారత పునుగు పిల్లి, భారత పంగోలిన్లతో బాటుగా కొన్ని అరుదైన జంతువులు, పక్షులు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో కడ్య, గూగల్, ముసలి వంటి అనేక రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి.