ఖేడ్ బ్రహ్మ రహదారి పై అంబాజీ మందిరానికి ఒక కి.మీ. దూరంలో కైలాష్ టేక్డి అనే ఒక కొండపై మాంగల్య వనం ఉంది. ప్రతి రాశి గుర్తుకు చెందిన మూడు మొక్కలు ఉన్న ఈ ప్రత్యేకమైన తోట జ్యోతిష్య శాస్త్ర తోటగా పేరొందింది. ఈ మొక్కలు రత్నాలు చూపినట్లే మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్యులు పేర్కొంటారు.
పర్యాటకులు ఈ జ్యోతిష్య మొక్కలను గురించే ఇంకా తెల్సుకోవడానికి వస్తారు, కొంతమంది సందర్శకులు ఈ మొక్కలను ఇళ్ళకు కూడా తీసుకొని వెళ్తారు. ఒకరి రాశి చిహ్నానికి చెందిన మొక్కలను వారి ఇంటి ప్రాంగణంలో పాతితే శుభం కలుగుతుందని నమ్ముతారు.