బేర్ బాబా బుద్ధ అనేది గోల్డెన్ టెంపుల్ ఆవరణలో కల మూడు పవిత్ర చెట్లలో ఒకటి. మిగిలిన రెండూ లాచి బేర్ మరియు దుఃఖ భంజాని బేర్ గా పిలుస్తారు. అమ్రిత్ సరోవర్ ఉత్తర ఒడ్డున కల ఒక చెట్టుకు సిక్కు గురువు అయిన బాబా బుద్ధ పేరు పెట్టారు. బాబా బుద్ధ ఈ చెట్టు కింద కూర్చుని సరోవర్ ట్యాంక్ నిర్మాణాన్ని పర్యవేక్షిన్చాడని చెపుతారు. 1604లో హర మందిర్ సాహిబ్ లో ఆది గ్రంధ ఏర్పరచినపుడు బాబా బుద్ధను గ్రంధి గా నియామకం చేసారు. బాబా బుద్ధ తన చివరి రోజులను రాం దాస్ విలేజ్ లో గడిపాడు. సరిగ్గా గోల్డెన్ టెంపుల్ ముందర కల బేర్ బాబా బుద్ధ గోల్డెన్ టెంపుల్ సందర్శనను పూర్తి చేస్తుంది.