గురుద్వారా చేహార్త సాహిబ్ అమ్రిత్ సర్ కు 7 కి.మీ.ల దూరంలో కల గురుకి వదలి గ్రామం లో వుంటుంది. సిక్కుల ఆరవ గురువు గురు హరగోవింద్ సింగ్ జి ఈ గ్రామం లో జన్మించాడు. తన కుమారుడి జన్మదిన వుత్సమలో గురు అర్జన్ దేవ్ జి ఈ ప్రదేశంలో చేహార్థ అనే పెద్ద బావి తవ్వించాడు. ఈ మోట బావి పైన మూసి వేసి నప్పటికీ నీటిని ప్రధాన ట్యాంక్ కు అందిస్తుంది.
బావి పేరు పెట్టబడిన ఈ గురుద్వారా లో ఒక దివాన్ హాల్ కలదు. అక్కడే బంగారం తాపడం చేసిన ఒక లోటస్ డోమ్ నిర్మించారు. హాలు ముందు భాగంలో రెండు 25 మీ. పొడవైన ఫ్లాగ్ పోస్టులు వుంటాయి. నిషాన్ సాహిబ్ పేరుతో ఈ సిఖ్ జండాలు ఎగరేస్తారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ నిర్వహిస్తున్న ఈ గురుద్వారా తప్పక చూడదగిన పర్యాటక ఆకర్షణ.