టర్న్ తరణ్ అనేది పంజాబ్ లో ఒక జిల్లా. అమృతసర్ నగరం నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. టర్న్ తరణ్ సాహిబ్ జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది. ఈ నగరం 5 వ సిక్కు గురువు గురు అర్జన్ దేవ్ జీ చే స్థాపించబడింది. సిక్కులకు పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా ఉన్నది. అనేక చారిత్రక గురుద్వారాలలో టర్న్ తరణ్ సాహిబ్,దర్బార్ సాహిబ్ శ్రీ గురు అర్జన్ దేవ్ జీ అన్నిటిలోనికీ ప్రధానమైనవి. నగరంలో ఉన్న టర్న్ తరణ్ పవిత్ర ట్యాంక్ ప్రపంచంలోనే అతి పెద్దది.
గురు అర్జన్ దేవ్ జీ చే స్థాపించబడిన గురుద్వారా దర్బార్ సాహిబ్ మూడు అంతస్థుల నిర్మాణం టర్న్ తరణ్ సరోవర్ యొక్క ఆగ్నేయ మూలలో ఉన్నది. ఈ గురుద్వారా యొక్క సొగసైన నిర్మాణం,బంగారు పూతతో ఎగువ భవనం యొక్క ప్రత్యేకలక్షణం. గొడుగు ఆకారంలో బంగారంతో చెక్కిన మరియు సున్నితమైన గార ఇంటీరియర్లతో కమలం ఆకారంలో గోపురం ఉంటుంది. ఒక ఆర్చ్ వంటి గేట్వే గుండా గురుద్వారా లోకి వెళ్లి ఒక పాలరాయి వేదికపై నిలబడండి. అమృత్సర్ పర్యటనలో తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశము.