దీనిని సభా ప్రాంగణం అంటారు . ఇది సుమారు 1200 అడుగుల ఎత్తున కలదు. దీనిని కలలపై ఆసక్తి కల అర్కి పాలకుడు రామ్ షరా సింగ్ 1830 లో నిర్మించారు. దివాన్ ఐ ఖాస్ లో కాంగ్రా రాజస్థాని, అర్కి, కుళ్ళు, ఐరోపా తీరు కల కుడ్య చిత్రాలు వుంటాయి. పూవులు, మహిళల చిన్న విగ్రహాలు వంటివి కలవు. చైనా చిత్రాలు, పంజాబీ జానపద కళలు, రాగిణి, ప్రేమ చిత్రాలు, యుద్ధ చిత్రాలు, జంతువులు పక్షులు, పురాణాల కధలు గోడలపై పెయింటింగ్ లు గా ప్రదర్శించారు. ఇవన్నీ అర్కి యొక్క వారసత్వ వైభవాన్ని తెలుపుతాయి.