వికసి౦చిన పూతోటలు, మంచుతో కప్పబడి తళుకులీనుతున్నపర్వత శిఖరాలు, సహజమైన లోయలు, అడవులలోని ఆకుపచ్చ ఆకుల శబ్దాలు, భూమిపైని ఇరుకైన పాయల ద్వారా ప్రవహించే ఇరుకు తోవలో మెరిసే ప్రవాహాలు, బౌద్ధ సన్యాసులు పఠించే శ్లోకాలు, అతిధి సత్కారాలు చేసే ప్రజలు; వీటన్నిటినీ మీరు అనుభవించాలనుకుంటే, అరుణాచల్ ప్రదేశ్ సందర్శించాలి. ఈ రాష్ట్రంలోని సంపన్న, వైవిద్యభరితమైన వృక్ష, జంతుజాలాలతో కూడిన మీ ఇంద్రజాల ప్రయాణం ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించి ఉండరు.
అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ భూగోళ శాస్త్రం రాష్ట్ర భౌగోళిక లక్షణాలతో కీలక పాత్రను పోషించే అరుణాచల్ ప్రదేశ్ పర్యాటక రంగం పర్యాటకులు నివశించడానికి, చిన్నది కానీ పెద్దది కానీ; అన్వేషించిన లేదా అన్వేషి౦చబడనిదైనా; ప్రకృతిలోని ప్రతి అంశం ఎంతో అందాన్ని అందిస్తుంది. భారతదేశానికి తూర్పువైపున ఉన్న ఈ ప్రాంతాన్ని ఉదయిస్తున్న సూర్యుని భూమి అంటారు. ఈ భూభాగం ఎక్కువగా హిమాలయ పర్వత శ్రేణులతో కప్పబడి ఉంటుంది, ఇది సియాంగ్, సుబన్సిరి, కమెంగ్, తిరప్, లోహిత్ అనే ఐదు నదీ లోయలుగా విభజించబడింది. ఈ అందమైన లోయలు దట్టమైన పచ్చని అడవులతో చుట్టబడి ఉన్నాయి.
పూతోటల స్వర్గం భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ “పూతోటల స్వర్గంగా” పిలువబడుతుంది. ఇక్కడ 500 కంటే ఎక్కు పూతోటల రకాలు ఉన్నాయి, మొత్తం రకాలలో సగం భారతదేశం మొత్తంలో ఉన్నాయి. ఇక్కడ నశించిపోతున్న, అరుదైన జాతులకు చెందిన పూతోటలు ఉన్నాయి. పూతోటల పరిశోధన, అభివృద్ది కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వారిచే స్థాపించబడింది. ఇటానగర్, సేస్సా, టిపి, దరంగ్, రోయింగ్, జెంగింగ్ అలంకరపూరితమైన, హైబ్రిడ్ రకాల రెండిటినీ కలిగిఉండే రాష్ట్ర పరిశోధన అటవీ సంస్థ వారి కింద పూతోటల కేంద్రాలు ఉన్నాయి.
సేస్సా పూతోటల అభయారణ్యం అనేక రకాల పూతోటల జాతుల సేకరణకు పేరుగాంచింది. ఈ పూతోటల అందమైన రంగులు ఒక కళాకారుడి సున్నితమైన స్ట్రోక్ లాగా అరుణాచల్ ప్రదేశ్ అందమైన దృశ్యాన్ని వర్ణిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లో సాహసోపేతమైన పర్యటన అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకం సాహసోపేత ఔత్సాహికులకు ఒక సంతోషకరమైన అనుభవాన్ని అందిస్తుంది. సహసకర్యాలు ఇష్టపడేవారందరికీ ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, యాన్గ్లింగ్ మూడు ప్రధాన కార్యకలాపాలు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఎక్కువ ప్రదేశాలు ట్రెక్కింగ్ కి అనువుగా ఉంటాయి. అక్టోబర్, మే నెలల మధ్య సమయం ట్రెక్కింగ్ కి సరైనది. పర్యాటకుల కోసం కమెంగ్, సుబన్సిరి, దిబంగ్, సియాంగ్ నదులతోపాటు తెల్లనీటి రివర్ రాఫ్టింగ్ ట్రిప్పులు నిర్వహించబడుతున్నాయి. గాలంవేయడంలో ఔత్సాహికులకు రాష్ట్రము మొత్తంలో యాన్గ్లింగ్ పండుగ కూడా నిర్వహించబడుతుంది.
అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రజలు, సంస్కృతి అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రజలు చాలా సాధారణమైన, ఆతిధ్య గుణంకలవారు. ఈ రాష్ట్రంలో 26 కంటే ఎక్కువమంది తెగలు నివసిస్తున్నారు, స్థానికులు వారి కళలకు, సంస్కృతికి అనుబంది౦చబడి ఉన్నారు. ఆపతాని, ఆకా, గాలో, బోరి, టాగిన్, న్యిషి ఇక్కడి ప్రధాన తెగలు. ఇక్కడ అనేక భాషలు మాట్లాడతారు. సంవత్సరం మొత్తం నృత్యం, సంగీతం తో అనేక గిరిజన పండుగల నిర్వహిస్తారు. కొత్త సంవత్సరంలో తవాంగ్ లో నిర్వహించబడే లోసార్ పండుగ అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి. డ్రీ పండుగ, సోలుంగ్ పండుగ, రెహ్ పండుగలను కూడా ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకుంటారు.
అరుణాచల్ ప్రదేశ్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకం మీకు వివిధ సంస్కృతి, ప్రజలు, ప్రకృతి, భాషల కలగూరగ౦పను దర్శింప చేస్తుంది. రాజధాని ఇటానాగర్ లో ఇటానగర్ వన్యప్రాణి అభయారణ్యం, ఇటా కోట లాంటి పర్యాటక ఆకర్షణలు వున్నాయి. తవాంగ్, అలోంగ్, జిరో, బొమ్దిలా, పసిఘాట్ లాంటి ఇతర పర్యాటక కేంద్రాలు కూడా అరుణాచల్ ప్రదేశ్ లో వున్నాయి.పైగా, నమ్దఫా జాతీయ పార్కు, ఈగల్ నెస్ట్ వన్యప్రాణి అభయారణ్యం, డేయింగ్ ఎరింగ్ వన్యప్రాణి అభయారణ్యం లాంటివి అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకం లో ప్రధాన కేంద్రాలు.
అరుణాచల్ ప్రదేశ్ వాతావరణం అరుణాచల్ ప్రదేశ్ వాతావరణం చాలా వైవిధ్యం తో కూడి వుంటుంది, ఎత్తుతో పాటు మారుతూ వుంటుంది. హిమాలయాలలోని ఎగువ భాగం లో మంచుతో కూడిన వాతావరణం వుంటుంది. మధ్య హిమాలయాల్లో సమ శీతోష్ణ వాతావరణం, దిగువ ప్రాంతంలో ఉప ఉష్ణ మండల వాతావరణం వుంటాయి. అరుణాచల్ ప్రదేశ్ లో మే నుంచి సెప్టెంబర్ దాకా భారీ వర్షాలు పడతాయి.