జమ్మూ & కాశ్మీర్ లో అవన్తిపూర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ ప్రదేశం లో రెండు పురాతన దేవాలయాలు అంటే శివ అవన్తీశ్వర మరియు అవన్తిస్వామి విష్ణు లవి కలవు. ఈ రెండు దేవాలయాలాను 9 వ శతాబ్దం లో రాజు అవంతి వర్మ నిర్మించాడు. వీటిలో ఒక దానిని లయకారుడు శివుడి కి మరి ఒకటి విష్ణువు కు నిర్మించాడు. ఈ దేవాలయ నిర్మాణం లో అనుసరించిన శిల్ప శైలి గ్రీకుల శిల్ప శైలి ని పోలి వుంటుంది.
ఈ యాత్రా స్థలాలు ప్రస్తుతం శిధిలావస్థలో కలవు. శివ అవన్తీశ్వర దేవాలయం సుల్తాన్ సికందర్ చే దాడి చేయబడింది. ఇతను భుక్తి సేన్ పేరుతో ఈ ప్రాంతాన్ని కొంత కాలం పాలించాడు. ఈ దాడి లో నిర్మాణం దెబ్బ తింది. అంతే కాక ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన నిర్మాణ వస్తువులు దాడులకు , ప్రకృతి విపత్తులకు నిలువలేక పోయాయి. కాలక్రమంలో ఇవి భూమిలో కలసి పోగా, వీటిని 18వ శతాబ్దం లో బ్రిటిష్ పాలకులు తవ్వకాలలో వెలికి తీసారు. ఆ సమయం లో వారు కొన్ని విగ్రహాలను తీసుకు పోయారు. ఈ దేవాలయాల కొన్ని కళా కృతులను ఇప్పటికి శ్రీ నగర్ లోని శ్రీ ప్రతాప్ సింగ్ మ్యూజియం లో చూడవచ్చు.
శివ అవన్తీస్వర మరియు అవన్తీస్వామి విష్ణు దేవాలయాలు శిదిలావస్థ లో ఉన్నప్పటికీ , ఈ గుడుల విగ్రహాలు రూపం మారినప్పటికీ వాటిని చూడవచ్చు. అవన్తిపూర్ చూడాలనుకునే వారు విమానం, రైల్వే లేదా రోడ్ మార్గం లో ప్రయాణించవచ్చు. అవన్తిపూర్ కు శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ పోర్ట్ ఇది 29 కి. మీ. ల దూరం లో కలదు.
అవన్తిపూర్ కు జమ్మూ తావి రైలు స్టేషన్ సమీపం. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన స్టేషన్ లకు రైళ్ళు కలవు. పర్యాటకులు బస్సులలో కూడా ఈ ప్రాంతాన్ని చేరవచ్చు. అయితే, అవన్తిపూర్ కు నేరు బస్సు లు లేవు. మొదటగా శ్రీనగర్ చేరి అక్కడ నుండి అవంతి పూర్ కు బస్సు చేపట్టాలి. అవన్తిపూర్ వెళ్ళాలి అనుకునేవారు వాతావరణ అనుకూల పరంగా, ఏప్రిల్ మరియు నవంబర్ ల మధ్య సందిర్సిస్తే అనుకూలంగా వుంటుంది.