పేరు సూచిస్తున్నట్టు తులసి ఉద్యాన్ ఒక గార్డెన్ పార్క్. రామాయణం గా ప్రఖ్యాతి చెందిన రామ్ చరిత మానస్ రచించిన గొప్ప కవి అయిన తులసీ దాస్ జ్ఞాపకార్ధం ఇది ఏర్పాటు చేయబడింది. తులసీ దాస్ విగ్రహం ఈ అందమైన గార్డెన్ లో కనిపిస్తుంది.
అయోధ్యా ప్రాంతం లో ని ఫైజాబాద్ మార్గం గుండా వెళ్ళే జాతీయ రహదారి వద్ద ఉన్న అయోధ్య బస్ స్టాండ్ కి సమీపం లో ఈ గార్డెన్ ఉంది. ఇంతకు పూర్వం ఇంగ్లాండ్ రాణి విక్టోరియా పేరు తో విక్టోరియా గార్డెన్ గా ఈ పార్క్ ప్రసిద్ది. ఆవిడ విగ్రహం కూడా ఇక్కడ ఉంది. 1960 లో తులసీ ఉద్యాన్ గా ఈ పార్క్ పేరు మారింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్యాన్ విభాగ్ నిర్వహణ లో ఈ గార్డెన్ ఉంది.