బాదామి చూసే పర్యాటకులు దత్తాత్రేయ దేవాలయం కూడా చూడాలి. ఇది 12వ శతాబ్దానికి చెందినది. ధార్ వాడ లోని గాంధీ చౌక్ లో ఉంది. అన్ని వైపులనుండి దీనిని చేరవచ్చు. దీనిని దత్తన గిడు అని కూడా అంటారు. దీనిలో మూడు ముఖాలు కల దత్తాత్రేయ భగవానుడు ఉంటాడు. ఈ భగవంతుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల అవతారంగా భావిస్తారు. ఈ దేవాలయం చాళుక్య శిల్ప సంపద కలిగి ఉంటుంది.