మాలేగిట్టి శివాలయం పట్టణం నుండి రెండు కి.మీ.ల దూరంలో ఒక కొండపై కలదు. 7వ శతాబ్దపు పురాతన రాతి దేవాలయాలలో ఇది ఒకటి. ఈ దేవాలయాన్ని ఒక పూలదండలు తయారు చేసే భక్తుడికి అంకితం చేశారు. దీనికి మోర్టార్ లేదా ద్రవిడ స్తంభం వంటివి లేవు. దుగువ శివాలయం కు ద్రవిడ స్తంభం కలదు. అయితే ఇపుడు దాని కింది నిర్మాణమే కలదు. ఇక్కడ రెండు శిలా శాసనాలు కనపడతాయి. ఒకటి ఈ శివాలయాన్ని నిర్మించిన శిల్పి ఆర్యమించి ఉపాధ్యాయ అని రెండవది 1543 నాటి విజయనగర పాలకుల పాలన గురించి. ఒక పెద్ద ధాన్యాగారం, రెండు గోడల కోటలు, వివిధ శిల్పాలు, ఒక భూగర్భ గది కూడా కలవు. బాదామి కోటలోని ఈ దేవాలయాన్ని పర్యాటకులు తప్పక చూడాలి.