పట్నాఘర్ చివరి రాజు శ్రీ శ్రీ రాజేంద్ర నారాయణ సింగ్ దియో వందేళ్ళ క్రితం రాజేంద్ర పార్కును నిర్మించాడు. ఈ పార్కు బలంగీర్ నగరం నడిబొడ్డున ఉంది.
ఈ పార్కులో వందల రకాల గులాబీలతో బాటు ఇతర జాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. సాయంత్రం వేళల్లో ఈ పార్కు వెలిగే ఫౌంటేనులతో అందంగా మెరిసిపోతుంది. పైగా, సాయంత్రం వేళల్లో పాత హిందీ పాటలను వినిపిస్తారు. ఈ పాటలను వినటానికి డాల్బి డిజిటల్ సౌండ్ సిస్టం అందుబాటులో ఉంది. పార్కు మధ్యలో శ్రీ శ్రీ రాజేంద్ర నారాయణ సింగ్ దియో విగ్రహం ఉంది.
బలంగీర్ పురపాలక సంఘం వారు ఈ మధ్యనే పార్కును పునరుద్ధరించారు. ఈ పార్కులో పిల్లలకు ఆడుకోవడానికి ఏర్పాట్లు, అనేక వినోద కార్యక్రమాలు, కేఫ్టేరియా ఉన్నాయి. ఈ పార్కు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది.