దొడ్డ బసవన గుడి గా పిలవబడే వృషభ ఆలయం దక్షిణ బెంగళూరు – బసవనగుడి లోని ఎన్ ఆర్ కాలనీ లో వుంది. నందీశ్వరుడు ఇక్కడి ప్రధాన దైవం. హిందూ పురాణాల ప్రకారం నందీశ్వరుడు శివుడికి వాహనమే కాక పరమ భక్తుడు. నందీశ్వరుడి ఆలయాల్లోకల్లా అతి పెద్దదైన ఈ ఆలయాన్ని 1537 లో విజయనగర రాజ్య సామంత రాజు కెంపె గౌడ నిర్మించాడు. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవూ వుండే ఇక్కడి నందీశ్వరుని విగ్రహాన్ని గ్రానైట్ ఒంటి రాతిలోంచి మలిచారు.ఈ ఆలయాన్ని ద్రావిడ శైలి లో నిర్మించారు – విశ్వభారతి నది ఈ విగ్రహం పాదాల నుంచే పుట్టిందని చెప్తారు. క్షేత్ర చరిత్ర ప్రకారం ఇప్పుడు గుడి వున్న ప్రదేశం దాకా వున్న వేరుసెనగ చేలన్నీ తినేస్తూ వచ్చిన ఓ పెద్ద వృషభాన్నిశాంతింప చేసేందుకు ఈ గుడి కట్టారు. ఈ గాధకు స్మారకం గా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నెలల్లో గుడి దగ్గ కడలేకయి పరిషే (వేరుసెనగ పండుగ) నిర్వహిస్తారు – వేరుసెనగ పంట అప్పుడే చేతికి వస్తుంది కనుక. ఈ గుడిని దర్శించాలంటే ఇదే మంచి సమయం.వృషభ ఆలయం సమీపంలోనే దొడ్డ గణేష్ దేవాలయం వుంది. బసవనగుడి కనుక్కోవడం యాత్రికులకు కష్టమేమి కాదు. బెంగళూరు నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు చాలానే వున్నాయి.