1969 లో నగరం నడిబొడ్డున చిన్నస్వామి స్టేడియం ఏర్పాటయింది. క్వీన్స్ రోడ్డులోని కబ్బన్ పార్క్ లో వున్న ఈ స్టేడియం దేశంలోని మైదానాల్లో కల్లా ప్రసిద్ది పొందింది. 1977-80 మధ్య BCCI అద్యక్షుడిగాను, నాలుగు దశాబ్దాల పాటు KSCA అధ్యక్షుడి గాను పని చేసిన శ్రీ చిన్నస్వామి పేరిట ఈ స్టేడియం ఏర్పాటయింది.
భారత్ – వెస్ట్ ఇండీస్ దేశాల మధ్య 1974 లో మొదటి టెస్ట్ మాచ్ ఇక్కడ జరిగింది. కర్ణాటక రంజీ జట్టుకి ఇది పుట్టినిల్లు – అలాగే IPL ఫ్రాంచైజీ రాయల చాలే౦జర్స్ , బెంగళూరు కి కూడా.55000 మంది కూర్చోగల ఈ మైదానం భారత్ లో ప్రపంచ కప్ పోటీలు జరిగినప్పుడల్లా – 1987, 1996, ఇటీవల 2011 లోనూ – పోటీలకు ఆతిధ్యం ఇచ్చింది. క్రికెట్ చరిత్ర లో అద్భుత క్షణాలకు ఈ మైదానం సాక్షి గా నిలిచింది. మైదానం ఆధునికీకరణ కు కూడా ప్రణాళికలు తయారవుతున్నాయి.
సీటింగ్ సామర్థ్యాన్ని 70000 కు పెంచాలని KSCA ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలే రాయల చాలెంజర్స్, బెంగళూరు కు హోం గ్రౌండ్ గా మారాక విజయ్ మాల్య సారధ్యం లోని యు.బి గ్రూప్ సౌజన్యంతో కొన్ని ఆధునికీకరణ పనులు జరిగాయి.